హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి స్విమ్స్ నర్సింగ్ అప్రెంటీస్ షిప్ శిక్షణ నిమిత్తం బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంచాలకులు డాక్టర్ గుడారు జగదీష్ తెలిపారు. నేషనల్ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ స్కీం కింద వంద మందికి ఏడాది పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 10 వరకు స్విమ్స్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు.