హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 4 నుంచి పిడుగురాళ్లలో ఇంటర్ సిటీ స్టాప్

PLD: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. లింగంపల్లి–విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (12795/12796)కు సెప్టెంబర్‌ 4 నుంచి పిడుగురాళ్లలో స్టాపేజ్‌ మంజూరైంది. ఉదయం 8:06కి చేరుకుని 8:07కి, రాత్రి 7:08కి చేరుకుని 7:09కి రైలు బయలుదేరుతుంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు ప్రయోజనం కలగనుంది.