హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూకట్‌పల్లి ఇందిరమ్మ ఇళ్ల లాటరీలో గందరగోళం

MDCL: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లాటరీ డ్రాలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎస్సీ కేటగిరీ జాబితాలో ఓబీసీ అభ్యర్థుల పేర్లు రావడంతో దరఖాస్తుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టేజ్‌పైకి వెళ్లి అధికారులను నిలదీయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో డ్రా ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.