హైదరాబాద్: 28°C
తెలంగాణ

మడికొండ ఐటీ పార్కులో పనిచేయని సీసీ కెమెరాలు

HNK: కాజీపేట మండలం మడికొండ ఐటీ పార్కులోని ఎస్‌ఈజెడ్‌లో టెకీల భద్రత కోసం 2020లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. పర్యవేక్షణ లేకపోవడంతో కెమెరాలు తుప్పుపట్టి పనిచేయడం లేదు. సైయంట్, క్వాడ్రంట్, జెన్‌ప్యాక్ట్‌ కంపెనీల్లో సుమారు వెయ్యి మంది టెకీలు పనిచేస్తున్న నేపథ్యంలో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కెమెరాలను పునరుద్ధరించాలన్నారు.