W.G: సెప్టెంబర్ 1న నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ కల్పశ్రీలతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. హెలిపాడ్, బందోబస్తు, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటనపై కలెక్టర్ సమీక్ష


