హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తత అవసరం'

NRPT: ఊట్కూర్ గ్రామపంచాయతీలో SIR ప్రక్రియపై తహశీల్దార్ అశోక్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ, మరణించినవారి పేర్లు, డబుల్ ఎంట్రీలు తొలగించి పారదర్శక జాబితా రూపొందించాలని తెలిపారు. తప్పులను సకాలంలో సవరించాలని సూచించారు.