హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యలు లేని ప్రాంతంగా మారుస్తాం'

VZM: రాజాం మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావు శుక్రవారం స్దానిక ఆదర్శ్‌ నగర్‌, అమ్మవారు కాలనీలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల వినతి ప్రకారం డ్రైన్లు, వీది దీపాల సమస్యలను సాయంత్రంలోగా పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం రోడ్లు, తాగునీటి సమస్యలపై అంచనా వేయాలని AE సాయి కిరణ్‌‌ను ఆదేశించారు. త్వరలో కాలనీలను సమస్యలు లేని ప్రాంతంగా మారుస్తామన్నారు.