హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేపాల్ వరదల్లో నల్గొండ మహిళ గల్లంతు

NLG: నేపాల్‌లో విహార యాత్రకు వెళ్లిన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కందిమల్ల సుహాసిని రెడ్డి (42) వరదల్లో గల్లంతైనట్లు సమాచారం. కుటుంబంతో ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఆమె, హైదరాబాద్‌లో గృహ ప్రవేశం కోసం ఈ నెల 19న భారత్‌కు వచ్చారు. 23న నేపాల్‌కు వెళ్లగా వరదల్లో గల్లంతయ్యారు. భర్త నన్నూరి సంజీవరెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు.