KRNL: గోతులదొడ్డిలో గురువారం రాత్రి సమయంలో చిరుత పులి దాడి చేసింది. మాజీ సర్పంచ్ వీరేశ్కు చెందిన గొర్రెల షెల్టర్పై పడి ఒక గొర్రెను చంపేసింది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తూ వరుసగా దాడులకు పాల్పడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గొర్రెపై చిరుత పులి దాడి


