హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతికి క్వాంటమ్‌ ఏఐ యూనివర్సిటీ

GNTR: రాజధాని అమరావతికి NIELIT నేతృత్వంలో మరొక ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ రానుంది. రూ.730 కోట్లతో దేశంలోనే తొలి క్వాంటమ్‌ AI యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంపస్ నిర్మాణం కోసం 8.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ CRDA ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక తాత్కాలికంగా సెప్టెంబర్‌ 13 నుంచే ఆంధ్రా యూనివర్సిటీలో NIELIT తరగతులు ప్రారంభం కానున్నాయి.