హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్‌తో కిరాణా వ్యాపారికి గాయాలు

KMR: రామారెడ్డి కేంద్రంలో గురువారం కిరాణా వ్యాపారి భరత్ విద్యుత్ షాక్‌కు గురయ్యారు. షాపు ముందు వేలాడుతున్న డిష్ కేబుల్ వైరును పైకి కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ లైన్‌కు తగిలింది. దీంతో భరత్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.