KDP: ఎర్రగుంట్ల బస్టాండులో గురువారం ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు ప్రకాశ్నగర్ లేదా సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న మహిళా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుడి వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
బస్టాండులో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి


