హైదరాబాద్: 28°C
వార్తలు

59 కోట్లకు చేరిన జన్‌ధన్‌ ఖాతాలు

దేశంలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాల సంఖ్య 59 కోట్లు దాటింది. ఖాతాల్లో మొత్తం రూ.3.17 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. 2014 ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2026 ఆగస్టు 19 నాటికి ఒక్కో ఖాతాలో సగటున రూ.5,356 ఉన్నాయని, 12 ఏళ్లలో ఒక్కో ఖాతాకు డిపాజిట్‌ 3.4 రెట్లు పెరిగిందని తెలిపింది.