హైదరాబాద్: 28°C
వార్తలు

సోషల్ మీడియా వేదికగా ఉగ్ర వల

యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, పాక్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 150 మందికి పైగా అనుమానితులపై దర్యాప్తు ప్రారంభించింది. గత 4 నెలల్లో 52 మంది నిందితులను అరెస్టు చేసింది. వీరంతా దేశవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తేలింది. అలాగే, వీరు భారత్‌లోని యువతను సోషల్ మీడియా ద్వారా ఆకర్షించి, వారిని తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు గుర్తించారు.