హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై టీడీపీ ఇన్‌ఛార్జి ఆరా

KDP: బద్వేలు మున్సిపాలిటీ 33వ వార్డు గాండ్ల వీధిలో నిర్వహించిన డోర్‌టు డోర్ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మంచూరు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.