హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీడీవో కరుణసాగర్ మృతి

ATP: యల్లనూరు ఎంపీడీవో కరుణసాగర్ అనారోగ్యంతో మరణించారు. ఈయన ఏడాది పాటు యల్లనూరు మండలంలో పనిచేసి, గత నెలలో డిప్యుటేషన్‌పై గుంతకల్లు డీడీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో అనారోగ్య బారిన పడిన ఆయన, కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో మనోహర్ తెలిపారు.