BDK: హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. మణుగూరు సింగరేణి ఓసీ-2 డీప్సైడ్ బ్లాక్ గనిని సింగరేణి దక్కించుకోవడంపై భట్టికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో మణుగూరు ప్రాంత అభివృద్ధి, కార్మికుల ఉపాధి, సంక్షేమానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
భట్టిని కలిసిన పినపాక ఎమ్మెల్యే పాయం


