HNK: పరకాల పట్టణంలోని ఆశ్రమంలో మదర్ థెరిస్సా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్, విద్యార్థులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవసేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు మదర్ థెరిస్సా అని కొనియాడారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'మానవసేవకు ప్రతిరూపం మదర్ థెరిస్సా'


