కృష్ణా: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గుడివాడ షాదీ ఖానాలో బుధవారం యువకులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలు కాపాడేందుకు తమ వంతు సహకారం అందించారు. రక్తదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయవచ్చని, ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తదానానికి ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుడివాడలో రక్తదానం చేసిన యువకులు


