హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సముద్ర తీరంలో శివయ్య, విష్ణు విగ్రహాలు!

BPT: వేటపాలెం మండలంలోని చల్లారెడ్డి పాలెం పంచాయతీ పరిధి పొట్టి సుబ్బాయపాలెం సముద్ర తీరంలో శివయ్య, విష్ణు విగ్రహాలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తులు నిన్న రాత్రి ట్రాక్టర్‌లో విగ్రహాలను తీసుకొచ్చి సముద్రంలో పడవేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే విగ్రహాలను ఎవరు, ఎందుకు సముద్రంలో పడవేశారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.