ప్రకాశం జిల్లా మేదరమెట్ల మండలం బోడ్డువానిపల్లి సమీపంలో నేషనల్ హైవేపై బుధవారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గాయపడ్డ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు


