హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్విన్‌పేట చెక్‌పోస్ట్ వద్ద ముమ్మర వాహన తనిఖీలు

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట చెక్‌పోస్ట్ వద్ద ఎస్‌ఐ నీలకంఠరావు ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.