హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుటుంబ కలహాలతో గృహిణి ఆత్మహత్య

ASR: కుటుంబ కలహాలతో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చింతపల్లిలో చోటుచేసుకుంది. కొత్తూరుబయలుకు చెందిన శివకుమార్‌, కొయ్యూరు మండలం కొండసంతకు చెందిన కొండమ్మ (32) తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం చింతపల్లిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొండమ్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.