PLD: నరసరావుపేట డీఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిరసన చేపట్టారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని, పాస్ మార్కులను 40 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలు, సిలబస్లో మార్పులు చేసి ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలని కోరుతూ డీఈఓ పీవీజే రామారావుకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
టెట్ రద్దు చేయాలి: యూటీఎఫ్


