హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాధిక్ ఖాన్‌కు ఉరిశిక్ష విధించాలి: ఎంపీ ఉదయ్

కాకినాడ: నలుగురి మరణానికి కారకుడైన సాధిక్‌కు ఉరిశిక్ష పడేలా చూడాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ మంగళవారం కలెక్టర్‌ను కోరారు. ఏఈ నూకరాజు కుటుంబంలో ప్రాణాలతో మిగిలిన కార్తికేయరెడ్డిని వెంటబెట్టుకుని కలెక్టర్‌ను కలిసి ఘటనపై చర్చించారు. కార్తికేయరెడ్డికి రక్షణ కల్పించడంతో పాటు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.