BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్లో వన మహోత్సవంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎ. భాస్కరరావు ఆధ్వర్యంలో 3,500 మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
మొక్కలు నాటి సంరక్షించాలి: అదనపు కలెక్టర్


