హైదరాబాద్: 28°C
వార్తలు

ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ఘోర ప్రమాదం

ఢిల్లీ-అమృత్‌సర్-కథ్రా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సమయంలో లాంచింగ్ మిషన్ ద్వారా హైవే కాంక్రీట్ దిమ్మెను అమర్చుతుండగా, అది ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పైనుంచి కింద పడిపోయింది. ఆ సమయంలో అక్కడ పనులు చేస్తున్న కార్మికులు దీని కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.