హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్య కార్మికుడికి మేయర్ పరామర్శ

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ఇవాళ పాల్వంచ 40వ డివిజన్‌లో పలు ప్రాంతాలను సందర్శించి, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికుడు విజయ్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.