VKB: దుద్యాల మండలంలో కంది పంటలను పరిశీలించిన టీఆర్వీకే కోఆర్డినేటర్ డాక్టర్ టీ. రాజేశ్వర్రెడ్డి, మేఘావృత వాతావరణం వల్ల ఫైటోప్థొరా కాండం కుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, సరైన తేమ నిర్వహణతోనే తెగులును అరికట్టవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి తులసి, ఏఈవోలు పాల్గొన్నారు.
తెలంగాణ
కంది పంటకు కాండం కుళ్లు ముప్పు: టీఆర్వీకే


