హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణపతులనే ప్రతిష్ఠిద్దాం.. హైడ్రా పిలుపు

HYD: గణేష్ ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు బదులుగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, పూడికతీత, ఎస్టీపీల ఏర్పాటులో హైడ్రా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, ఉత్సవాల సమయంలో నీటి వనరులు కలుషితం కాకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.