హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ పోరుబాటకు మద్దతు తెలిపిన ఎంపీ R. కృష్ణయ్య

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేపట్టిన 48 గంటల దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలు చెల్లించాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.