MDK: జిల్లాలో గతంలో పనిచేసి పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ రిటైర్డ్ ఉద్యోగులు డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన వారికి వెంటనే పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పాండురంగారావు, గోపాల్రావు, రాములు, రాంరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
'అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలి'


