హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రిజర్వాయర్‌ బాధిత రైతులకు న్యాయం చేయాలి'

అన్నమయ్య: నేతగుట్లపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కోసం భూములు కోల్పోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ళ రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లు గడిచినా పరిహారం అందలేదని పేర్కొంటూ.. బాధిత రైతులతో కలిసి మదనపల్లె కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందించారు.