హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలి'

VSP: జిల్లాలో మూడో మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి, పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు శ్రీనుబాబు కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌ను కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.