హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప రాష్ట్రపతికి కానుకగా కొండపల్లి కళాకృతి..!

కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక కానుక అందించారు. కొండపల్లి కళాకారులు సంప్రదాయ పద్ధతిలో రూపొందించిన సీతారాముల పట్టాభిషేకం బొమ్మను ఆయనకు బహూకరించారు. ఆంధ్రప్రదేశ్‌ కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ అరుదైన కళాకృతిని ఉపరాష్ట్రపతి ఆసక్తిగా తిలకించారు.