హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

BPT: అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై కొమ్మలపాడు మిట్టల వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి తమిళనాడు ఐరన్‌ లోడుతో వెళ్తున్న TN 52 AB 8240 నంబర్‌ గల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.