GNTR: తెనాలి శివారు కటివరంలో భారీ చోరీ జరిగింది. అయ్యప్ప ఆలయం వెనుక అపార్టుమెంట్లోని రెండో అంతస్తు ఇంటి మెయిన్ డోర్ పగలగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. బెడ్రూమ్ తలుపులు, బీరువా ధ్వంసం చేసి రూ.5 లక్షల నగదు, 85 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితురాలు హైదరాబాద్లో ఉండగా, వాచ్మెన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
కటివరంలో భారీ చోరీ


