హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ ఉల్లంఘనలపై 303 కేసులు: SP

కడప జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు విస్తృతంగా ట్రాఫిక్‌ తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 303 కేసులు నమోదు చేసి రూ.72,899 జరిమానా వసూలు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్‌ ధరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ సూచించారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.