హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెల్ల దొరలను గడగడలాడించిన టంగుటూరి

VZM: తెల్ల దొరలను గడగడలాడించిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని, నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఆదివారం విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.