హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండకు కొత్త తాగునీటి పథకం

PLD: వినుకొండ పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ గ్రౌండ్‌లో రూ.239.06కోట్లతో చేపట్టనున్న నూతన తాగునీటి పథకానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి వినుకొండ ప్రజలకు తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని జీవీ ఆంజనేయులు తెలిపారు.