KNR: మానకొండూరు మండలంలోని కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై శంషాబాద్ బస్టాండ్ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, స్థానికులు వెంటనే క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: కారు, బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు


