SKLM: శ్రావణ మాసం సందర్భంగా ఈనెల 28న అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఈవో KNVD ప్రసాద్ తెలిపారు. ఆదిత్యాలయం అనివెట్టి మండపంలో ఉదయం 9.15 గంటలకు పూజలు మొదలవుతాయని చెప్పారు. వ్రతంలో పాల్గొనే భక్తులు ముందుగా దేవస్థానంలో టికెట్లు పొందాలని ఆయన సూచించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28న వరలక్ష్మీ వ్రతాలు


