ELR: దెందులూరు SI వెంకట్ కుమార్ సిబ్బందితో కలిసి సోమవరప్పాడు గ్రామ పరిధిలోని పొలాల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.14,800, 3 సెల్ఫోన్లను, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని SI హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్


