GNTR: తెనాలి మండలం బుర్రిపాలెం, కాజీపేట, పెదరావూరు గ్రామాల్లో విద్యుత్ స్తంభాల తీగలు చోరీ చేసిన ఘటనలపై మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 7గురుని అరెస్టు చేసిన పోలీసులు, పీటీ వారెంట్పై శనివారం తెనాలి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని దర్శి సబ్జైలుకు తరలించినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు.
వార్తలు
చోరీ నిందితులకు రిమాండ్


