ఛత్తీస్గఢ్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పేపర్ లీక్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రైవేటు కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్తోపాటు ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్.. ప్రశ్నపత్రం ఉన్న సీల్డ్ కవర్లోకి ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి ఫొటోలు, వీడియోలు తీసినట్లు విచారణలో తేలింది.
వార్తలు
ఎండోస్కోపిక్ కెమెరాతో ప్రశ్నపత్రం లీక్


