నీట్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్లో బాధితుడు సాహిల్ లోచబ్తో కలిసి దాదాపు 8 గంటల పాటు ధర్నా చేపట్టారు. పోలీసులు కేసు నమోదుకు నిరాకరించడంతో ఆయన అక్కడే బైఠాయించి పట్టువీడకుండా నిరసన తెలిపారు. దీంతో ఎట్టకేలకు పోలీసులు బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వార్తలు
పెల్లెట్ గన్ ఫైర్ వివాదం.. FIR నమోదు


