AKP: ఈనెల 22న సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కె.కోటపాడు మండలం ఏ-కోడూరులో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్తో కలిసి ఆమె హెలిప్యాడ్, రహదారి, సభా వేదికలను పరిశీలించారు. అలాగే ఎస్సీ కాలనీలో సీఎం ప్రజలతో నిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
వార్తలు
'సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి'


