హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లె రోడ్‌ మీదుగా రెగ్యులర్‌ రైలు

అన్నమయ్య: షోలాపూర్‌–అనకాపల్లి మధ్య మదనపల్లె రోడ్‌ మీదుగా నడుస్తున్న వీక్లీ స్పెషల్‌ రైలును రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. 11313/11314 రైలు సర్వీసులు ఆగస్టు 21 నుంచి రెగ్యులర్‌గా నడవనున్నాయి. దీంతో మదనపల్లె రోడ్‌ ప్రాంత ప్రయాణికులకు తిరుపతి, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రైలు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.