TG: ప్రజల సంక్షేమమే తన జీవితాశయమని, తుది శ్వాస వరకు పనిచేస్తానని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, నాగార్జునసాగర్ నీటిని తాగు, సాగునీటికి సమానంగా జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. తాము ప్రజలనే పిల్లలుగా భావిస్తున్నామని, వారి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
ప్రజల సంక్షేమమే నా జీవితాశయం: ఉత్తమ్


