హైదరాబాద్: 28°C
వార్తలు

1971 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలి: డీకే

డీలిమిటేషన్ విషయంలో 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా కొనసాగించాలని కేంద్రమంత్రి అమిత్ షాను కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కోరారు. ప్రస్తుత లోక్‌సభలోని 543 స్థానాలను యథాతథంగా కొనసాగిస్తూ, అదే స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గితే అన్యాయం జరుగుతుందన్నారు.